మేడమ్మ ప్రెసిడెంటు

పొద్దున్నే ఆంధ్రజ్యోతి చూడగానే "మేడమ్ ప్రెసిడెంట్" అని ప్రతిభా పాటిల్ నవ్వుతున్న ఫోటోవేసి, "రాష్ట్రపతి ఎన్నికలో యూపీఏ కూటమి అభ్యర్థి శ్రీమతి ప్రతిభా పాటిల్ విజయం సాధించారు. రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలిమహిళగా ప్రతిభా పాటిల్ ఖ్యాతి గడించారు" అని రాశారు. పదనివి చేపట్టి ఖ్యాతిగడించడం కాదు, ఖ్యాతి గడించడంకోసం ఆవిడ ఆ పదవిని కోరుకున్నారని నాకనిపించింది. కనీసం ఎనభైశాతం ప్రజలు/యువత కోరిన అబ్దుల్‌కలాంగారికి పోటిగా ఎవరైనా నిలబడటమెందుకు? పైగా, ఆమె విజయం దేశప్రజల నైతిక విజయమని స్టేటుమెంటొకటి. నా దృష్టికి ఆమె నవ్వులో న్యూనత కనిపిస్తోంది. ఏదేమైనా, ఎవరు మన రాష్ట్రపతి మరియు సైనికత్రిదళాధిపతి అయికూర్చున్నా, వారిని మనం గౌరవించాలి. జై హింద్!

కామెంట్‌లు

జ్యోతి చెప్పారు…
ఏంటో అస్సలు అర్ధం కాదు. ఎమిటీ గొప్ప ఆ పదవిలో నిలబడి గెలవడానికి ఒక స్త్రీ , రాయకీయవేత్త తప్ప. ఐనా మన ప్రభుత్వం వారు స్త్రీ అనే సెంటిమెంటుతో గెలుస్తుందనే ధీమాతో ఆవిడని నిలబెట్టారు అంతే . ఆవిడ మీద ఎన్ని ఆరోపణలొచ్చినా ఎవ్వరూ లెక్క చేయలేదు. ప్రజలందరూ కోరిన కలాం ను దుర్భాషలాడిన ఘనులు ఎవరిని నిలబడితే ఎంటి. వాల్ల చేతిలో కీలుబొమ్మగా బాగా పనికొస్తుంది.ఐనా మంచిదే ఐంది, కలాం గారి విజ్ఞానం అంతా పంచుకోవడానికి విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు.
Valluri Sudhakar చెప్పారు…
ఈ "రాచకీయ" ఖేళిలో విజ్ఞతకు కాదు, విధేయతకే పెద్దపీట. అదే భారతీయుల తలరాత.

...వల్లూరి
rākeśvara చెప్పారు…
అదే మరి ఆడేడో అమెరిక్కాలో కూర్సోని టపాలెయ్యండం కాదు. సీమకొచ్చి ఓటేసి మంసిని గెలిపించాల, సెడును అణగదొక్కాల.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

లఘు కవితలు - సర్వలఘు కందము

ఉత్పలమాల - గురువు - లఘవు