పోస్ట్‌లు

ఏప్రిల్, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

వారవనిత - తిమ్మకవి

రసికజన మనోభిరామ రచనానంతరం ఆ కృతి చదివిన వారవనిత ఒకామె కూచిమంచి తిమ్మకవిని కౌగిలించుకొనగా ఆయన పెడమొగం పెట్టాడట. ఆప్పుడామె - 'చతురులలోన నీవు గడు జాణ వటంచును నేను గౌగిలిం చితి నిటు మాఱుమోమిడఁగజెల్లునె యో రసికాగ్రగణ్య!' అని ప్రశ్నించిందట. దానికి తిమ్మకవి - 'అద్భుతమగు నట్టి బంగరపు బొంగరపుంగవఁబోలు నీ కుచ ద్వితయము ఱొమ్మునాటి యల వీపున దూసెనటంచుఁజూచితిన్' అని జవాబిచ్చాడట. ఇంతకూ ఈ మా'ట' నాకెవరు చెప్పారు? :)