పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2007లోని పోస్ట్‌లను చూపుతోంది

దొంగరాముడు - బ్యాడ్లక్ష్మణుడు - చోరాంజనేయుడు - సత్తెకాలపుశబరి

మరియు వీరబల్లె బేనీషా పండ్ల బుట్ట.

ఈ దినమ్‌మ్ మన కళాశాల దినమ్

ఈ దినమ్‌మ్ పరమ బోరింగు దినమ్. నిన్న రాత్రి - టైరులో గాలి నిలవడం లేదని వాల్‌మార్ట్‌కు తీసుకుపోతే అంతా బాగుందని గాలి నింపి పంపించేశారు. పొద్దున్నే ఆఫీసుకెళ్లి కారు పార్క్ చేసి చూస్తే కుడివైపు ముందుటైర్‌లో గాలి బొత్తిగా లేదు. మా టీం మేట్ ఒకావిడ చాలా విచారంగా ఉంది, పోయిన వారం వాళ్లనాన్న చనిపోయారని. జోకులేసే వాతావరణం లేదు. ఆఫీసులో పనే లేదు. అలా అని బొత్తిగా లేకుండానూలేదు. సరైన పని లేకపోతే పరమ బోర్. సాయంత్రం కొంత ముందే పార్కింగ్‌లాట్‌కొచ్చి టైర్ మారుద్దామంటే కారిచ్చిన కుదుపుకు జాకీ వంకీలు తిరిగిపోయింది. మహానుభావుడూ ఆపద్భాంధవుడూ అయిన మరో మిత్రుడు వచ్చి ఈ విషయంలో సహాయం చేశాడు. అతనిసాయంతోను, అతని జాకీసాయంతో ఈ రోజు సాయంత్రం మరో టైర్లరిపేరు షాపుకెళ్తే వాడూ అదేమాట. సమస్యేమీలేదని గాలినింపి పంపించేశాడు. అక్కడినుంచీ ఇండియన్‌స్టోర్‌కు వెళ్లి తిరిగొస్తూ వస్తూ ఇంటి సమీపానికొస్తున్నామనగా, హైవే నుండి ఎగ్జిట్ అవుతూ లేన్ మార్చబోయి కర్బ్ ఎక్కించబోయాను. కొద్దిలో తప్పింది. మా ఆపద్బాంధవుడు అలర్టయి నన్నూ హెచ్చరించి తప్పించినాడు. వెంటనే నిద్రపోయి ఈరోజును ఇంతటితో ముగించేయాలి. ఏదోలోకంలో వుండి బండినడుపుతున్న నేను అ

ప్రభుతకు హైకోర్టు మెట్టేటు

న్యాయవాది ఎస్. జనార్ధన్ గారికి ధన్యవాదాలతో ఈనాడు లో ఈనాటి సంతోషకరమైన వార్త: *** *** *** *** *** సమ్మెలు, రాస్తారోకోలను అనుమతించొద్దు ప్రధాన కార్యదర్శి, డీజీపీకి హైకోర్టు ఆదేశం పార్టీల తీరుపై ఆగ్రహం, నోటీసులు జారీ హైదరాబాద్‌-న్యూస్‌టుడే(ఫిబ్రవరి 12, 2007) రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ సంస్థలు రహదార్లపై సమ్మెలు, రాస్తారోకోలు చేపట్టడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లపై నిర్వహిస్తున్న సమ్మెలు, రాస్తారోకోలను అడ్డుకోవడంలో ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న, తీసుకోబోయే చర్యల గురించి కౌంటరు దాఖలు చేయాలని డీజీపీని ఆదేశించింది. ఇందుకు రెండువారాల గడువిచ్చింది. భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా సమ్మెలు, రాస్తారోకోలకు అనుమతులివ్వరాదని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు వివిధ పార్టీలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. జనజీవనానికి ఇబ్బంది కల్గిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గానీ, ప్రభుత్వానికి మద్దతుగా గానీ పార్టీలు సమ్మెలు చేయడం సరికాదని పేర్కొంది. బంద్‌లు, రాస్తారోకోలను నిషేధ

ప్రతివాది భయంకర శ్రీనివాస్

సీతారామకళ్యాణం సినిమాలో నారదుని పాత్రధారి (కాంతారావుగారనుకుంటాను) పాడే "దేవదేవ పరంధామ నీలమేఘ శ్యామా" అనే పాట సినిమా అంతటా ముఖ్యమైన సన్నివేశాలలో సందర్భోచితంగా కొంతకొంత వినిపిస్తూ ఆ సన్నివేశానికి ఒక వ్యాఖ్యానంలాగా సాగుతుంది. నేపధ్యగాయకులు బహుభాషాపండితులు శ్రీనివాస్‌గారు. ఇప్పటికి లెక్కలేనన్ని సార్లు విన్నానీపాటను. తనివితీరదు. విన్నప్రతిసారీ వెంటనే మళ్లీ ఒకసారైనా వినవలసిందే. ఆయన అధికారిక వెబ్‌సైట్‌ లో ఇక్కడ వినవచ్చు.