పోస్ట్‌లు

అక్టోబర్, 2008లోని పోస్ట్‌లను చూపుతోంది

జగజ్జేత - చెంఘిజ్‌ఖాన్

" మానవునిలో వుండే బలహీనత లన్నింటిలోనూ, యితరుల బాధచూసి ఓర్చలేకపోవటం వంటి దురదృష్టకరమైన బలహీనత మరొకటి లేదు. ఏ రకం కిరాతుడిలోనైనా సరే, ఇది యే మూలనో ఒక మూల యింతో అంతో అణగి వుంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నవాళ్లు, ఎంత లావు ధీశాలినైనా సరే, ఇట్టే కూలదీసివేయగలుగుతారు. తండ్రి, తను కోరిన వస్తువు ఇవ్వకపోతే, బిడ్డ అన్నం తినకుండా ఏడుస్తూ మంచంలో యెదుట పడుకుంటుంది. భర్త చెప్పినమాట వినేవాడు కాకపోతే, భార్య ఏడుస్తూ కూర్చుని వాణ్ణి లొంగదీస్తుంది. కానీయో దమ్మిడీయో పారవెయ్యకపోతే, మొండి బండాడు కత్తితో చెయ్యో కాలో కోసుకుంటానని మనని బెదిరిస్తాడు. పెళ్ళాంమీద కోపమొస్తే మొగుడు అన్నం తినకుండా మొండిచరిచి పడుకుంటాడు. ఈ రకంగా మానవునిలో వుండే యీ మహా దౌర్బల్యాన్ని ఆధారం చేసుకుని, వొత్తిడి తీసుకురావడంవంటి హిజాడ పని మరొకటి లేదు. న్యాయమైన పద్ధతిని ఎదుటివాడికి నచ్చచెప్పలేక, కొంతమంది ఇలాంటి నీచమైన పిరికిపద్ధతులు అవలంబించుతారు. " 12, 13 శతాబ్దాలలో మంగోల్ యుద్ధాల వెనక ఉన్న రాజకీయ, చారిత్రక స్థితిగతులను - తననాటికున్న వివిధ గ్రంథాల నాధారంగా ఎంతో నైపుణ్యంతో చరిత్రను కాల్పనిక కావ్యంగా మలచి, తెన్నేటి సూరి చేసిన సాధి

రసికవతంసుడు - టైపాటు

రాజ భోజ రవితేజ దాన జిత కల్పభూజ జోహార్ నీదు ... సుమకోటి తేనెలానేటి తేటి జోహార్ అసమప్రభావ జోహార్ రసికావతంస జోహార్ పై పంక్తులు ఎవ్వరివో ఎక్కడివో అందరికీ తెలుసు. ఈ పాటను కనకపోయినా కనీసం వినియైనా వుంటారు. ఇందులో "..." ఏమిటో ఎవరైనా చెబుతారేమోనని ఈ టపా రాస్తున్నాను. అసలింతకూ నాకీపాట ఎందుకు గుర్తొచ్చిందంటే నిన్న ఒక పుస్తకంలో రసికవతంసుడు అనే పదం చదివాను. ఎవరా రసికవతంసుడు అంటే, రాయలవారు. మనకు తెలిసిన కృష్ణదేవరాయల సంగతి కాదు, తంజావూరు నాయకరాజులలో ప్రసిద్ధుడైన రఘునాథరాయల సంగతి. ఈయన గురించి ఏం చెప్పారంటే "1600 మొదలు 1630 వరకు తంజావూరును పాలించిన పండితకవి రఘునాథనాయకుడు, కృష్ణదేవరాయల అనంతరం అంతటివాడేకాక అంతకుమించినవాడని ఎంచదగిన ఆంధ్రభోజుడు. శత్రువులను నిర్మూలించుటలో అవక్ర పరాక్రమశాలి. జనరంజకముగా దేశాన్ని పరిపాలించుటలో నేర్పుగల రాజనీతి నిపుణుడు. సహృదయులు మెచ్చేటట్లు రసభావకవిత సంస్కృతం, తెలుగు రెండింటిలో చెప్పగల విద్వత్కవి. నూతన రాగాలను, తాళాలను కనిపెట్టి వీణల మేళవింపును సంస్కరించగలిగిన సంగీతశాస్త్ర నిపుణుడు, మేధావి. యజ్ఞనారాయణ దీక్షితులు, మధురవాణి, రామభద్రాంబ మొదలగు కవిశిరోమణులను తీర్